స్పోర్ట్స్

Trending:


నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

విశ్వక్రీడా సంబురానికి వేళైంది. అధునిక ఒలింపిక్‌ చరిత్రలో 33వ క్రీడలు నేడు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడల చరిత్రలో తొలిసారి ప్రారంభ వేడుకలను స్టేడియంలో కాకుంటా బయట నిర్వహించనున్నారు. ఇందుకోసం పారిస్‌లోనే ప్రముఖ సెన్‌నదిని సిద్ధం చేశారు. ఈ వేడుకలను చూసేందుకు సుమారు 3 లక్షల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనాలు ఉన్నాయి. భద్రత దృష్ట్యా ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 150 కిలోమీటర్ల ప్రాంతాన్ని నోఫ్లై...


Team India | టీమిండియా జెర్సీపై మ‌రో న‌క్ష‌త్రం.. కార‌ణ‌మిదే..!

Team India : శ్రీ‌లంక సిరీస్ ఆరంభానికి రెండు రోజులు ఉంద‌న‌గా భార‌త ఆట‌గాళ్లు కొత్త జెర్సీల‌తో ఫొటోల‌కు పోజిచ్చారు. పేస‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్(Mohammad Siraj), ఖ‌లీల్ అహ్మ‌ద్‌(Khaleel Ahmed)లు రెండు స్టార్ల‌తో కూడిన జెర్సీ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Paris Olympics | చలో పారిస్‌.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం

విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..


PCB | చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌.. ఇగ మీ దయ: పీసీబీ

వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పాల్గొంటుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి వదిలేసింది.


Olympics | న్యూజిలాండ్‌ సాకర్‌ టీమ్‌పై స్పై.. కెనడా సపోర్ట్‌ స్టాఫ్‌ నిర్వాకం

ఒలింపిక్స్‌ ఆరంభానికి ముందే కెనడా ఫుట్‌బాల్‌ జట్టులోని పలువురు చేసిన నిర్వాకానికి ఆ దేశం ఐవోసీ ఎదుట క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. న్యూజిలాండ్‌ సాకర్‌ టీమ్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో భాగంగా ఆకాశంలోకి డ్రోన్‌ రావడంతో ఆ జట్టు కోచింగ్‌ సిబ్బంది ఈ విషయాన్ని ఒలింపిక్స్‌ నిర్వాహకుల వద్దకు తీసుకెళ్లారు.


Paris Olympics | ఆటలు ఆరంభం.. ఒలింపిక్స్‌లో మొదలైన టీమ్‌ ఈవెంట్స్‌

క్రీడాభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విశ్వక్రీడా సంబురాలకు ఎట్టకేలకు తెరలేచింది. పారిస్‌ వేదికగా జరుగుతున్న 33వ ఒలింపిక్స్‌ పోటీలలో భాగంగా బుధవారం సాకర్‌, రగ్బీ సెవెన్స్‌ మ్యాచ్‌లతో విశ్వక్రీడలు ప్రారంభమయ్యాయి.


ఫైనల్‌కు భారత్‌

మహిళల ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత క్రికెట్‌ జట్టు వరుసగా 9వ ఎడిషన్‌లోనూ ఫైనల్‌ చేరింది. గురువారం దంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ఆ జట్టును చిత్తుగా ఓడించి టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. భారత బౌలర్లు రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (3/10), రాధా యాదవ్‌ (3/14) బౌలింగ్‌ దెబ్బతో మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌..


Ashish Nehra | అందుకే కోచ్‌ పదవి వద్దనుకున్నా: నెహ్రా

Ashish Nehra | 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా వచ్చి తొలి ప్రయత్నంలోనే ఆ జట్టుకు కప్పును అందించాడు. అంతేగాక వరుసగా రెండు సీజన్లలోనూ టైటాన్స్‌ను ఫైనల్‌ చేర్చడంలో నెహ్రా పాత్ర ఎంతో కీలకం. దీంతో ద్రావిడ్‌ వారసుడిగా నెహ్రా పేరు ముందువరుసలోకి వచ్చింది.


Paris Olympics | అద్భుత ప్రదర్శన.. క్వార్ట్‌ర్స్‌లోకి దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

పారిస్‌ ఒలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుండగా భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.


ఆరంభానికి ముందు ఉగ్ర కుట్ర?

విశ్వక్రీడల ఆరంభోత్సవ కార్యక్రమానికి కొద్దిగంటల ముందే ఆతిథ్యదేశంలో అశాంతిని రేకెత్తించడానికి ముష్కర మూకలు భారీ ఉగ్రకుట్ర పన్నాయా? అంటే గురువారం ఉదయం అక్కడ జరిగిన పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హైస్పీడ్‌ రైల్వే వ్యవస్థపై ఆకస్మిక దాడి జరగడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.


IND vs SL | భారత్‌తో సిరీస్‌కు ముందే లంకకు భారీ షాక్‌.. గాయంతో కీలక పేసర్‌ ఔట్‌

IND vs SL | స్వదేశంలో భారత్‌తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందే శ్రీలంక జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ గాయంతో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు.


రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నీ షురూ

తెలుగు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని అంతర్జాతీయ ప్లేయర్లు నందగోపాల్‌ కిదాంబి, జేబీఎస్‌ విద్యాధర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలబాలికల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభించారు.


Nino Salukvadze | 55 ఏండ్ల వయసులో ఒలింపిక్స్‌కు.. చరిత్ర సృష్టించనున్న జార్జియా షూటర్‌

Nino Salukvadze | 40 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒలింపిక్‌ పతకాలతో పాటు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, యూరో చాంపియనిషిప్స్‌లో నినొ సలుక్వడ్జె కొల్లగొట్టింది. తాజాగా పారిస్‌లోనూ బరిలోకి దిగనున్న నినొ.. పదోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటుండటంతో ఆమె విశ్వక్రీడల చరిత్రలో సరికొత్త రికార్డు లిఖించనుంది.


Union Budget | ఆటలకు అరకొర నిధులే.. గతేడాదితో పోల్చితే పెరిగింది రూ. 45 కోట్లే

కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో క్రీడారంగానికి అరకొర నిధులే దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ క్రీడలకు ఈ బడ్జెట్‌లో రూ. 3,442.32 కోట్ల కేటాయింపులు చేశారు. గతేడాది (రూ. 3,396.80 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్‌లో పెరిగింది రూ. 45.36 కోట్లు మాత్రమే.


MP Harbhajan Singh: క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌కు నోటీసు ఇచ్చా.. కానీ మాట్లాడే అవ‌కాశం రాలేదు: ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

MP Harbhajan Singh: రాజ్య‌సభ ఎంపీ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇవాళ మీడియాతో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త మూడు రోజులుగా క్వ‌శ్చ‌న్ అవ‌ర్ కోసం నోటీసులు ఇచ్చాన‌ని, కానీ త‌న‌కు మాట్లాడే అవ‌కాశం రాలేద‌ని హ‌ర్భ‌జ‌న్ పేర్కొన్నాడు. అమృత్‌స‌ర్ విమానాశ్ర‌యాన్ని విస్త‌రించాల‌న్న‌దే త‌న డిమాండ్ అని తెలిపాడు.


కోహ్లీ ఎప్పటికీ నాయకుడే: జస్‌ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్ కానప్పటికీ.. అతడు ఎప్పటికీ నాయకుడే అని పేర్కొన్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో టీమండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా బుమ్రా మాట్లాడాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆడటం సంతోషంగా ఉందని బుమ్రా ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.


కటింగ్‌ చేసుకొని నీట్‌గా కన్పించాలి.. శ్రీలంక క్రికెటర్లకు కోచ్‌ జయసూర్య ఆర్డర్

Sanath Jayasuriya: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ప్రారంభానికి ముందు శ్రీలంక తాత్కాలిక హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి స్టార్‌ ప్లేయర్లు టీ20లకు గుడ్‌బై చెప్పడం తమకు కలిసొస్తుందని పేర్కొన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీలంక ప్లేయర్లకు సూచించాడు. ఇదే సమయంలో శ్రీలంక ఆటగాళ్లు క్రమ శిక్షణతో మెలగాలని సూచించాడు. సరైన హెయిర్‌ కట్‌, నీట్‌గా ఉండాలని.. హెడ్‌కోచ్‌ స్పష్టం...


Olli Pope: టెస్టులో ఒకే రోజు 600 రన్స్ కొడతాం.. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ సంచలన వ్యాఖ్యలు

Bazball Cricket: ఇంగ్లాండ్ యువ బ్యాటర్ ఓలీ పోప్‌.. టెస్టు క్రికెట్‌లో బజ్‌బాల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే తాము టెస్టుల్లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చిన ఈ బ్యాటర్.. భవిష్యత్‌లో ఒకే రోజు ఆటలో 600 పరుగులు చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతంతో పోలిస్తే తమ జట్టు మరింత బలంగా ఉందని.. దూకుడుగా ఆడటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. తమ సహజ శైలిలో ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని పోప్‌ వ్యాఖ్యానించాడు.


Paris Olympics | పారిస్‌లో ఎలుకల బెడద.. ధికారులకు సవాల్‌ విసురుతున్న మూషికాలు

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఎలుకల బెడద స్థానిక అధికారులకు సవాల్‌గా మారింది. వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌ను వీక్షించడానికి పారిస్‌కు వచ్చే సందర్శకులకు నగరంలో మూషికాలు కనిపించకుండా ఉంచేందుకు పారిస్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.


Vice Captain : బుమ్రా కాదు.. టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఎవ‌రికంటే?

Vice Captain : టెస్టుల్లో బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌నున్నారు. అత‌ని స్థానంలో మ‌రో క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌లో ఆ మార్పు జ‌ర‌గ‌నున్న‌ది.


England | క్లీన్‌స్వీప్ ల‌క్ష్యంగా ఇంగ్లండ్.. తుది జ‌ట్టు ఇదే..!

England : సొంతగ‌డ్డ‌పై బ‌జ్‌బాల్ ఆట‌తో చెల‌రేగుతున్న ఇంగ్లండ్(England) ఆఖ‌రి మ్యాచ్‌లోనూ విజ‌యంపై క‌న్నేసింది. రెండు టెస్టుల్లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి ఇప్పటికే కైవసం చేసుకున్న బెన్ స్టోక్స్ బృందం.. మూడో టెస్టు కోసం తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది.


భారత్‌, లంక యువ సవాల్‌

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన రోహిత్‌ శర్మ వారసుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి హెడ్‌కోచ్‌ పగ్గాలు అందుకున్న గౌతం గంభీర్‌కు కెప్టెన్‌-కోచ్‌గా శ్రీలంక సిరీస్‌తో మొదటి పరీక్ష ఎదురుకానుంది. ‘టార్గెట్‌-2026 టీ20 వరల్డ్‌ కప్‌' దిశగా భారత క్రికెట్‌ జట్టు తొలి అడుగు వేయనున్నది.


Paris Olympics | పునర్వైభవం దిశగా.. మరో పతకంపై కన్నేసిన భారత హాకీ జట్టు

ఒలింపిక్స్‌లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్‌ మొత్తం పది స్వర్ణాలు గెలిస్తే అందులో హాకీకి వచ్చినవే 8. అదీగాక మనకు తొలి పతకం దక్కిందే ఈ క్రీడలో.. 1928 అమెస్టర్‌డామ్‌ ఒలింపిక్స్‌ నుంచి 1956 (మెల్‌బోర్న్‌) దాకా ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ను ఓడించిన జట్టే లేదు.


INDW vs BANW | బంగ్లాను హ‌డ‌లెత్తించిన రేణుక.. భార‌త్ ల‌క్ష్యం..?

INDW vs BANW : మ‌హిళ‌ల ఆసియా క‌ప్ సెమీఫైన‌ల్లో భార‌త బౌల‌ర్లు చెల‌రేగారు. పేస‌ర్ రేణుకా సింగ్(3/10) విజృంభ‌ణ‌తో బంగ్లాదేశ్ టాపార్డ‌ర్ చేతులెసింది. ఆ త‌ర్వాత‌ స్పిన్న‌ర్ రాధా యాద‌వ్(3/14) సైతం మూడు వికెట్ల‌తో స‌త్తా చాట‌గా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.


Paris Olympics : ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీలో ‘లాస్ట్ స‌ప్ప‌ర్’ షో.. ఆ పేర‌డీపై తీవ్ర విమ‌ర్శ‌లు

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్స‌వ సంబ‌రాల్లో క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన లాస్ట్‌ స‌ప్ప‌ర్ పేర‌డీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్‌తో పాటు అత‌ని 12 మంది శిష్యులు భోజ‌నం చేసిన‌ట్లు ఉన్న డావిన్సీ ఫోటో ఆధారంగా .. ఓపెనింగ్ సెర్మ‌నీలో డ్రాగ్ క్వీన్ క‌ళాకారులు లాస్ట్ స‌ప్ప‌ర్ పేర‌డీ చేశారు.


Ashish Nehra | విరాట్‌ కోహ్లీ-గంభీర్‌ రిలేషన్‌పై మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా కీలక వ్యాఖ్యలు..!

Ashish Nehra | టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మధ్య ఎలాంటి సమస్య తనకు కనిపించడం లేదని భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నారు.


పాండ్యాకు ఫిట్‌నెస్‌ లేదని సొల్లు చెప్పొద్దు.. అజిత్‌ అగార్కర్‌పై క్రిష్ శ్రీకాంత్‌ మండిపాటు

హార్దిక్‌ పాండ్యాను కాదని భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించాడు. ఫిట్‌నెస్‌ పేరు చెప్పి పాండ్యాను తొలగించడం ఏమాత్రం కరెక్టు కాదని చెప్పుకొచ్చాడు. అందుకు ఇంకా ఏదో వేరే కారణం ఉందని క్రిష్‌ పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు సారథ్య లక్షణాలు ఉన్నాయని.. కానీ పాండ్యాను తొలగించిన తీరే సరిగ్గా లేదని వివరించాడు. టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ అసలైన కారణాన్ని...


Olympics 2024: భారత అథ్లెట్ల దుస్తులపై చర్చ.. రూ.200లకు కోఠిలో దొరుకుతాయని విమర్శలు!

పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుక్లో భారత అథ్లెట్లు ధరించిన దుస్తులు చర్చనీయాంశంగా మారింది. త్రివర్ణ పతాకాన్ని సూచించే రంగులతో భారత అథ్లెట్లు ధరించే దుస్తులను రూపొందించారు. చీర కట్టులో ఉన్న ఫొటోలను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ దుస్తుల క్వాలిటీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ లాంటి దేశ అథ్లెట్లు ధరించే దుస్తులు అవి కావని.. మరీ లో క్వాలిటీలో ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోఠిలో రూ.200 లకు...


Winter Olympics | సాల్ట్‌ లేక్‌ సిటీలో 2034 వింటర్‌ ఒలింపిక్స్‌

యూనైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) లోని ఉటా రాష్ట్రంలో ప్రధాన నగరమైన సాల్ట్‌ లేక్‌ సిటీ 2034 వింటర్‌ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.


Virat Kohli | కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా అతడే మా నాయకుడు.. ఛేజ్‌ మాస్టర్‌పై పేసుగుర్రం సంచలన వ్యాఖ్యలు

Virat Kohli | భారత క్రికెట్‌ జట్టును అత్యున్నత స్థానాన నిలపడంలో మాజీ సారథి విరాట్‌ కోహ్లీ పాత్ర ఎంతో ఉంది. అతడి హయాంలో టీమ్‌ఇండియా.. టెస్టులలో వరుసగా నాలుగేండ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది.


Hardik Pandya: ఇన్‌స్టాలో పిక్ పోస్టు చేసిన న‌టాషా.. ఎమోజీల‌తో హార్ధిక్ పాండ్యా రిప్లై

Hardik Pandya : న‌టాషా స్టాంకోవిక్ త‌న ఇన్‌స్టాలో ఓ పిక్ పోస్టు చేసింది. కుమారుడితో సెర్బియాలో దిగిన ఫోటోను అప్‌లోడ్ చేసింది. దానికి హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ఎమోజీల‌తో రియాక్ట్ అయ్యాడు.


Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ వేళ‌.. ఫ్రెంచ్ రైల్వే లైన్ల ధ్వంసం

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబ‌రాల వేళ‌.. ఫ్రాన్స్ రైల్వే వ్య‌వ‌స్థ‌పై దాడి జ‌రిగింది. కొంద‌రు దుండ‌గులు.. పారిస్‌కు వెళ్లే రైల్వే లైన్ల‌ను ధ్వంసం చేశారు. మూడు రూట్ల‌లో లైన్లు ధ్వంసం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ప‌లు మార్గాల్లో రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. కొన్ని రూట్ మ‌ళ్లించారు.


గ్రౌండ్‌లో లీడర్‌గా ఉండటం నాకిష్టం: సూర్యకుమార్‌ యాదవ్‌

Suryakumar Yadav: పూర్తి స్థాయి భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఇటీవలె బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన ప్రస్థానాన్ని శ్రీలంకతో సిరీస్‌ నుంచి ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇందులో కొత్త కోచ్‌ గంభీర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి సూర్యకుమార్ యాదవ్‌ వెల్లడించాడు. ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్‌ బాధ్యతలు తనకు దక్కడంపై తన మనసులోని మాటను బయటకు చెప్పాడు.


Olympics 2024 Ceremony: చరిత్రకు భిన్నంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. లైవ్ స్ట్రీమింగ్, భారత బృందం వివరాలు..

ఒలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్టేడియం వెలుపల ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. జూలై 26న సీన్ నది వెంబడి ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. అథ్లెట్లు ట్రాక్ మీద కాకుండా పడవల మీద రానుండటం విశేషం. పారిస్ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలను స్పోర్ట్స్ 18 ఛానెళ్లతోపాటు, జియో సినిమా యాప్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. భారత్ నుంచి ఈ వేడుకల్లో 117 మంది క్రీడాకారులు పోటీలో ఉన్నారు.


IPL | పంబాజ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా రంజీ వీరుడు.. ట్రోఫీ క‌ల‌ను నిజం చేస్తాడా..?

IPL : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో రోజురోజుకు ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ప‌ద్దినిమిదో సీజ‌న్ (IPL 2025) స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ప‌లు జ‌ట్లు త‌మ‌ హెడ్‌కోచ్‌లకు మంగ‌ళం పాడుతున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) సైతం కొత్త కోచ్ వేట‌ను మొద‌లెట్టింది.


Womens Archery: పారిస్ ఒలింపిక్స్‌.. మ‌హిళ‌ల ఆర్చ‌రీలో క్వార్ట‌ర్స్‌కు భార‌త్‌

Womens Archery: మ‌హిళ‌ల ఆర్చ‌రీ టీమ్ ఈవెంట్‌లో.. ఇండియా జ‌ట్టు క్వార్ట‌ర్స్‌లోకి ప్ర‌వేశించింది. అంకితా, భ‌జ‌న్, దీపికాలు అద్భుతంగా ప‌ర్ఫార్మ్ చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో .. ఇండియా పాజిటివ్‌గా స్టార్ట్ ఇచ్చింది.


Nita Ambani | ఏకగీవ్ర ఎన్నిక.. ఐవోసీలోకి నీతా అంబానీ

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ)లో ప్రముఖ క్రీడా ఔత్సాహికురాలు నీతా అంబానీ తిరిగి ఏకగీవ్రంగా ఎన్నికయ్యింది. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్‌లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్‌ సొంతం చేసుకుంది. ఎన్నికపై ఆమె స్పందిస్తూ ‘ఐవోసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది.


Paris Olympics | ఇందూరు బిడ్డ‌కు క‌ఠిన స‌వాల్.. టోక్యో విజేత‌కూ పెద్ద ప‌రీక్షే..!

Paris Olympics : విశ్వ క్రీడ‌ల్లో ప‌త‌కంపై క‌న్నేసిన తెలంగాణ బిడ్డ నిఖ‌త్ జ‌రీన్‌ (Nikhat Zarin)కు క‌ఠిన‌మైన డ్రా ల‌భించింది. శుక్ర‌వారం పారిస్ ఒలింపిక్స్ నిర్వాహ‌కులు బాక్సింగ్ డ్రా విడుద‌ల చేశారు. జూలై 27వ తేదీ శ‌నివారం బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి.


హర్మన్‌ ప్రీత్‌ @ 11

భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌, డాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలీవర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆకట్టుకున్నారు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌కౌర్‌ ఒక ర్యాంక్‌ మెరుగుపర్చుకుని 11వ ర్యాంక్‌కు చేరుకోగా, షఫాలీ నాలుగు ర్యాంక్‌లు ఎగబాకి 12వ ర్యాంక్‌లో నిలిచింది.


అమ్మాయిలూ అదుర్స్.. బంగ్లాను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత్, వరుసగా 9వ సారి ఆసియా కప్‌ ఫైనల్‌‌కు

India in Final: మహిళల టీ20 ఆసియా కప్‌ 2024లో భారత జట్టు ఫైనల్‌ చేరింది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. దీంతో వరుసగా తొమ్మిదోసారి ఫైనల్‌ చేరింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం భారత ఓపెనర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.


Paris Olympics | డోప్ టెస్టులో ఫెయిల్.. లాంగ్ జంప‌ర్‌పై నిషేధం

Paris Olympics : ఒలింపిక్స్ పోటీలు మొద‌లైన తొలి రోజే ఒక అథ్లెట్ డోప్ ప‌రీక్ష‌(DopingTest)లో ప‌ట్టుబ‌డింది. రొమేనియాకు చెందిన లాంగ్ జంప‌ర్ ఫ్లోరెంటినా ల‌స్కో(Florentina Lusco) డోప్ టెస్టులో ఫెయిల్ అయింది.


Brian Lara: బ్రియాన్ లారా పుస్త‌కం వివాదాస్ప‌దం.. క్ష‌మాప‌ణ‌లు కోరిన రిచ‌ర్డ్స్‌, హూప‌ర్‌

Brian Lara: మాజీ క్రికెట‌ర్లు రిచ‌ర్డ్స్‌, హూప‌ర్ గురించి బ్రియాన్ లారా త‌న పుస్త‌కంలో రాసిన కామెంట్ల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రిచ‌ర్డ్స్ త‌న‌ను, హూప‌ర్‌ను ఏడ్పించిన‌ట్లు ఆ బుక్‌లోపేర్కొన్నాడు. దీన్ని రిచ‌ర్డ్స్‌, హూప‌ర్ త‌ప్పుప‌ట్టారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆ ఇద్ద‌రూ కోరారు.


గంభీర్‌ శిక్షణ షురూ

భారత కొత్త కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్‌ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్‌ఇండియా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది.


గుజరాత్ టైటాన్స్‌కు నెహ్రా గుడ్‌బై..! యువీపై కన్నేసిన ఫ్రాంఛైజీ..!

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన కోచ్ ఆశిష్ నెహ్రా.. ఆ జట్టును వీడనున్నాడు. అతడితో పాటు టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి కూడా జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ కొత్త కోచ్‌ను నియమించుకోనున్నట్లు సమాచారం. అయితే ఆశిష్ నెహ్రా స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను నియమించుకోవాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతడితో సంప్రదింపులు...


SLW vs PAKW | దంచేసిన పాక్ అమ్మాయిలు.. శ్రీ‌లంక ముందు భారీ ల‌క్ష్యం

SLW vs PAKW : మ‌హిళ‌ల ఆసియా క‌ప్ సెమీ ఫైన‌ల్లో పాకిస్థాన్ (Pakistan) అమ్మాయిలు దంచేశారు. ఆతిథ్య శ్రీ‌లంక (Srilanka) బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు.


Mohammaad Siraj | సిరాజ్‌కు గాయం.. తొలి టీ20 ఆడేనా..?

Mohammaad Siraj : శ్రీ‌లంక‌తో టీ20 సిరీస్‌కు ముందు భార‌త జ‌ట్టుకు పెద్ద షాక్. లంక‌పై ఘ‌న‌మైన రికార్డు క‌లిగిన స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ (Mohammaad Siraj) గాయ‌ప‌డ్డాడు.


Covid-19 | పారిస్‌లో కరోనా కలకలం.. ఆస్ట్రేలియా వాటర్‌ పోలో జట్టులో ఐదుగురికి పాజిటివ్‌

శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పారిస్‌ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం రేగింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళల వాటర్‌ పోలో జట్టులోని ఐదుగురు క్రీడాకారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ దేశ చీఫ్‌ డి మిషన్‌ అన్నా మేరీస్‌ తెలిపారు.


SLW vs PAKW | ఆట‌పట్టు కెప్టెన్ ఇన్నింగ్స్.. అసియా క‌ప్ ఫైన‌ల్లో శ్రీ‌లంక‌

SLW vs PAKW : సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో శ్రీ‌లంక(Srilanka) ఫైన‌ల్లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.


Samit Dravid | టీ20 జ‌ట్టులో ద్ర‌విడ్ వార‌సుడు.. ఎంత ధ‌ర ప‌లికాడంటే..?

Samit Dravid : భార‌త మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) వార‌సుడు క్రికెట్‌లో దూసుకొస్తున్నాడు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరొంద‌ని సమిత్ ద్రావిడ్ (Samit Dravid) తాజాగా టీ20 వేలంలో భారీ ధ‌ర ప‌లికాడు.


‘ఆల్‌ ద బెస్ట్‌’

ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 117 మంది ప్లేయర్లను దేశ ప్రజలంతా ఉత్సాహపర్చలన్నారు. టోక్యో(2020) ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల(7) రికార్డును ఈసారి అధిగమించాలని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.