KKR VS PBKS HIGHLIGHTS: ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్

Kolkata Knight Riders vs Punjab Kings Full Highlights: ఈ ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆటతీరు ఊహతీతంగా మారింది. సంచలన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగిస్తున్నారు. నేడు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ విధించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలిలి ఉండగానే ఛేదించి పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో చరిత్రలోనే కాకుండా టీ20 హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. బెయిర్‌ స్టో (108) సెంచరీతో కదం తొక్కగా.. ప్రభుసిమ్రాన్ సింగ్ (54), శశాంక్ సింగ్ (68) హాఫ్ సెంచరీలు బాది జట్టును గెలిపించారు. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా.. కేకేఆర్‌కు మూడో ఓటమి

 

2024-04-26T18:14:18Z dg43tfdfdgfd