MI vs SRH : వాంఖడేలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) పేసర్లు చెలరేగుతున్నారు. పదునైన పేస్తో ముంబై బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మార్కో జాన్సెన్ తన మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (9) ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా.. కమిన్స్ తన వంతు అన్నట్టు రోహిత్ శర్మ(4)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత భువనేశ్వర్ సూపర్ బాల్తో తడబడుతున్న నమాన్ ధార్(0) ఇన్నింగ్స్కు తెరదించాడు.
దాంతో, 31 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్(4), తిలక్ వర్మ(0) లు ముంబైని ఆదుకునే పనిలో ఉన్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 36/3. ఇంకా ముంబై విజయానికి 138 రన్స్ కావాలి.
2024-05-06T16:44:10Z dg43tfdfdgfd