PARIS OLYMPICS | పారిస్‌ ఒలింపిక్స్‌కు జ్యోతికి లైన్‌క్లియర్‌

Paris Olympics | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు విదేశీ టోర్నీల్లో పోటీపడేందుకు తెలుగు యువ అథ్లెట్‌ యర్రాజీ జ్యోతితో పాటు శైలీసింగ్‌కు క్రీడాశాఖకు చెందిన మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌(ఎమ్‌వోసీ) క్లియరెన్స్‌ ఇచ్చింది.

శుక్రవారం జరిగిన సమావేశంలో పలువురు ప్లేయర్లు టోర్నీల్లో ఆడేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. యూరప్‌లో జ్యోతి ఆరు టోర్నీల్లో ఆడనుండగా, శైలి నాలుగింటిలో పోటీపడనుంది.

2024-05-03T22:18:33Z dg43tfdfdgfd