T20 World Cup 2024 : ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్(West Indies) తుది స్క్వాడ్ను ప్రకటించింది. గత కొన్నిరోజులుగా పొట్టి ఫార్మాట్కు సారథిగా ఉన్న రోవ్మన్ పావెల్(Rovman Powell) మెగా టోర్నీకి కెప్టెన్గా ఎంపికయ్యాడు.
గబ్బా టెస్టులో విండీస్ చారిత్రాత్మక విజయంలో భాగమైన పేసర్ షమర్ జోసెఫ్ (Shamar Joseph) వరల్డ్ కప్ బెర్తు పట్టేశాడు. వెస్టిండీస్ సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మందితో కూడిన బృందంలో ఎవరెవరు ఉన్నారంటే..?
వెస్టిండీస్ తుది బృందం : రొవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్(వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హిట్మైర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, అండ్రూ రస్సెల్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, గుడకేశ్ మోతీ, షెర్ఫనే రూథర్ఫర్డ్.
ఈ ఏడాది జూన్ 1న టీ20 ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీకి వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఇక రికార్డు స్థాయిలో రెండుసార్లు(2012, 2016) ట్రోఫీ నెగ్గిన కరీబియన్ జట్టు మూడో ట్రోఫీపై గురి పెట్టింది. అందుకని సెలెక్టర్లు హిట్టర్లు, ఆల్రౌండర్లతో కూడిన బలమైన స్క్వాడ్ను ఎంపిక చేశారు.
ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న పొవెల్, పూరన్, రస్సెల్ వంటి విధ్వంసక ఆటగాళ్లు మెగా టోర్నీలో తమ సత్తా చాటేందకు కాచుకొని ఉన్నారు. స్పిన్ ఆల్రౌండర్లు మోతీ, గుడకేశ్, రోస్టన్ ఛేజ్లు సొంతగడ్డపై తిప్పేసేందుకు సిద్ధమవుతున్నారు. తొలి పోరులో వెస్టిండీస్ జూన్ 2న పసికూన పపువా న్యూ గినియాతో తలపడనుంది.