Team India | దుబాయ్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం విడుదల చేసిన వార్షిక ర్యాంకులలో.. 122 పాయింట్లతో వన్డేలలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్-3లో నిలిచాయి. పొట్టి ఫార్మాట్లో రోహిత్ సేన 264 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా ఆసీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. టెస్టులలో మాత్రం భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. 124 పాయింట్లతో కంగారూలు మొదటి స్థానానికి ఎగబాకగా 118 పాయింట్లతో భారత్ రెండో ర్యాంక్లో ఉంది.
2024-05-03T22:33:35Z dg43tfdfdgfd