త్రిపుర: ‘సెవన్ సిస్టర్స్’గా పేరొందిన ఈశాన్య భారతాన మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. బీసీసీఐ ఆర్థిక సహకారంతో త్రిపురలోని పశ్చిమ త్రిపుర జిల్లా నర్సింగర్లో దీని నిర్మాణ పనులు జరుగుతుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా పూర్తిచేయనున్నట్టు త్రిపుర క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సెక్రటరీ సుబ్రత డే తెలిపారు.
2025 ఫిబ్రవరి తర్వాత రాష్ట్ర ప్రజలు అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించే అవకాశమున్నట్టు ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ర్టాలలో ప్రస్తుతం అస్సాంలోని బర్సపుర స్టేడియం మాత్రమే ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తోంది.
2024-05-07T20:17:50Z dg43tfdfdgfd