పావెల్‌ సారథ్యంలో..

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ కోసం వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ దేశ జట్టును శుక్రవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హార్డ్‌హిట్టర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ సారథ్యం వహించనున్నాడు.

స్వదేశం వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో విండీస్‌ టీమ్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నది. ఐపీఎల్‌లో ఆడుతున్న రస్సెల్‌, నికోలస్‌ పూరన్‌, హెట్‌మైర్‌, షెఫర్డ్‌, హోప్‌ లాంటి ప్లేయర్లు కీలకం కానున్నారు.

2024-05-03T22:18:33Z dg43tfdfdgfd