న్యూఢిల్లీ: ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న యూరప్ పర్యటన కోసం భారత జూనియర్ హాకీ జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ) శనివారం ప్రకటించింది. మొత్తం 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టుకు డిఫెండర్ రోహిత్ సారథ్యం వహించనుండగా, శారదనంద్ తివారీ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టూర్లో భాగంగా బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. అంతర్జాతీయ అనుభవం సాధించేందుకు ఈ టూర్ బాగా ఉపయోగపడుతుందని రోహిత్ పేర్కొన్నాడు.
2024-05-04T20:07:09Z dg43tfdfdgfd