T20 WORLD CUP 2024: 'టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. కార్తీక్, రాహుల్‌కు నో ఛాన్స్'

Indian Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ లో బరిలోకి దిగబోయే భారత జట్టు ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. టీమిండియా స్కాడ్ కు సంబంధించి రకరకాల లిస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న దినేష్ కార్తీక్, సంజూ శాంసన్, కేఎల్ కేఎల్ రాహుల్‌కు చోటు కల్పించలేదు. 

ఇర్ఫాన్ జట్టులో ఎవరెవరూ ఉన్నారంటే..

ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ను ఫిక్స్ చేశాడు. ఇక ఫస్ట్ డౌన్ లో కోహ్లీని ఉంచాడు. నాలుగో స్థానంలో టీ20కా బాప్ సూర్యకుమార్ యాదవ్ ను, ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఎంపిక చేశాడు.  కీలకమైన ఆరో స్థానానికి రింకూ సింగ్‌ను సెలక్ట్ చేశాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చోటు కల్పించాడు. ఈ మెగా టోర్నీ కోసం పఠాన్ ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నాడు. రవీంద్ర జడేజాతో పాటు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లకు తోడుగా అర్ష్‌దీప్ సింగ్ ను ఖరారు చేశాడు. అయితే బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ను తీసుకున్నాడు. 

Also Read: T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సింగ్ సిరాజ్, అర్ష్‌దీప్ జిరాజ్.

Also read: Irfan Pathan: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రోహిత్ కు జోడి అతడే.. గిల్ కాదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-04-24T11:55:43Z dg43tfdfdgfd